Logo
Download our app
గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు య‌థాత‌థం
NEWS   Feb 22,2025 12:14 pm
ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నిర్దేశించిన ప్ర‌కారమే గ్రూప్-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఈనెల 23న ఉద‌యం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు పేప‌ర్ -1 జ‌రుగుతుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్ -2 ఎగ్జామ్ నిర్వ‌హిస్తామ‌న్నారు. అభ్య‌ర్థులు 15 నిమిషాల కంటే ముందే త‌మ‌కు కేటాయించిన ప‌రీక్షా కేంద్రాల‌కు రావాల‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్షా కేంద్రానికి అనుమ‌తించ బోమ‌న్నారు. కాగా గ్రూప్ -2 ఎగ్జామ్ వాయిదా ప‌డుతుందని జోరుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి వాయిదా లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source