Logo
Download our app
ఏపీలో 55 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల తొల‌గింపు
NEWS   Feb 21,2025 07:49 am
ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో 55 మంది ప్ర‌భుత్వ డాక్ట‌ర్ల‌ను తొలగించింది. ఎలాంటి అనుమ‌తులు , సెల‌వు లేకుండా ఏడాదికి పైగా డాక్ట‌ర్లు విధుల‌కు గైర్హాజ‌రైన‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చాయి. డ్యూటీల‌కు ఎగ‌నామం పెట్టార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ లోకాయుక్త‌ను ఆశ్ర‌యించారు. విచార‌ణ చేప‌ట్టిన లోకాయుక్త వైద్యుల‌ను తొల‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం వైద్యుల‌ను తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source