హైన దాడిలో దూడ మృతి
NEWS Feb 20,2025 12:47 pm
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఏసీ తండాలో లేగా దుడాపై హైన దాడి చేసి చంపింది. రైతు లకావత్ తిరుపతి వివరాల ప్రకారం తన వ్యవసాయ పంట క్షేత్రంలో పనులు ముగించుకొని దూడేను చేనులో కట్టేసి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూసేసరికి హైన దూడపై దాడి చేసి చంపేసి వెళ్ళిపోయింది. రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హైన సంచరిస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.