ఆటో కోసం మిత్రుడినే హత్య చేసిన వైనం
NEWS Feb 19,2025 09:58 pm
ఆటో కోసమే మిత్రుడినే హత్య చేసిన కేసులో ఘరానా నిందితుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్ రాజ వెంకటరెడ్డి తెలిపారు.ఈ నెల 17న ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి అటవి ప్రాంతంలో వెలుగు చూసిన గుర్తు తెలియని యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల వ్యవధిలో చేదించారు.ఈనెల 15న తన భర్త కండేలా సందిప్ (28) కనిపించడం లేదని నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రహ్మణ కాలనీకి చెందిన కండేలా లత ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది.