ద్విచక్ర వాహనాలు ఢీ
NEWS Feb 19,2025 10:04 pm
గోవిందరావుపేట మండలం పసర గ్రామపంచాయతీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. మొద్దుల గూడెం గ్రామానికి చెందిన మాడ జగ్గారావు, పసర గ్రామానికి చెందిన పూజారి నరసయ్య గౌడ్ ఎదురెదురుగా ఢీకొనడంతో జగ్గారావు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.