కూటమి ప్రభుత్వం రైతులకు శాపం
NEWS Feb 19,2025 02:28 pm
మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంటూ ఆరోపించారు. అన్నదాతలు పండించే పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందిందంటూ మండిపడ్డారు. తమ హయాంలో క్వింటాలు మిర్చి ధర రూ. 21 నుంచి 27 వేలు ఉండేదన్నారు. కానీ చంద్రబాబు వచ్చాక కేవలం క్వింటాలుకు 8 నుంచి 11 వేలకు పడి పోయిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారవేత్తలకు వత్తాసు పలకడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు.