డీకే కామెంట్స్ పై చామల కన్నెర్ర
NEWS Feb 19,2025 11:53 am
బీజేపీ ఎంపీ డీకే అరుణపై నిప్పులు చెరిగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డులపై విధిగా పీఎం మోదీ పెట్టాలనడం పట్ల ఫైర్ అయ్యారు. ఫోటో పెడితే 90 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అంచనాకు మించి రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రస్తుతం తాము 54 లక్షల కార్డులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామన్నారు. కేంద్రం కేవలం ఒక కేజీ బియ్యం మాత్రమే అదనంగా ఇస్తోందని ధ్వజమెత్తారు ఎంపీ. ప్రతి నెలా ఇందు కోసం తాము రూ. 352 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.