హైకోర్టు లో గుండెపోటుతో న్యాయవాది మృతి
NEWS Feb 18,2025 04:17 pm
హైకోర్టులో కేసు వాదిస్తూనే కుప్ప కూలారు న్యాయవాది వేణు గోపాల్ రావు. పడిపోయిన ఆయనను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందారు. న్యాయవాద మృతికి సంతాప సూచకంగా హైకోర్టులో అన్ని బెంచ్ లలో విచారణ నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు జడ్జీలు. రేపటికి వాయిదా వేశారు. న్యాయవాది మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.