మహాదేవుని వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Feb 17,2025 12:56 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గం సదా శివానగర్ మండలం ఉత్నూర్ గ్రామంలో శ్రీ ఖండేరాయ మహాదేవుని ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్. ఖండేరాయ మహాదేవుని ఆశీస్సులు ప్రజల పై ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయ కమిటీ నిర్వాహకులు గుడి రాక పోకలకు ఇబ్బందిగా ఉందని, రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆలయ కమిటీ వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.