కుంభ మేళాలో నారా లోకేష్
NEWS Feb 17,2025 10:44 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ దంపతులు. ఆయనతో పాటు భార్య నారా బ్రాహ్మణి, తనయుడుతో కలిసి ఇవాళ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. గత జనవరి 13న మహా కుంభ మేళా ప్రారంభమైంది. 45 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు. ఈనెల 26వ తేదీ వరకు మహా కుంభ మేళా జరగనుంది.