ఎల్లమ్మ ఆలయాన్ని గ్రామ కమిటీకి అప్పగించాలని మంత్రికి వినతి
NEWS Feb 14,2025 06:26 pm
మెట్ పల్లి మండలం లోని వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయాన్ని గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించాలని ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. 100 ఏళ్లుగా గ్రామకమిటీ ఆలయాన్ని పర్యవేక్షిస్తుందని దేవాలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకోవడం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని పునరాలోచించి ఆలయాన్ని గ్రామకమిటీకి అప్పగించాలని కోరారు.