మంత్రి కొండ సురేఖతో ఎమ్మెల్యే భేటీ
NEWS Feb 15,2025 09:15 am
దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో సమావేశం అయ్యారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయన్ని గత వందేళ్లుగా గ్రామ కమిటీ వారు పర్యవేక్షిస్తున్నారని ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ లోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, ఈ విషయాన్ని పునరాలోచించి గ్రామ కమిటీకి అప్పజెప్పాలని కోరారు. ఇట్టి విషయంపై గ్రామస్తులంతా కలిసి ధర్నా నిర్వహించిన విషయాన్ని మంత్రి దృష్ఠికి తీసుకెళ్లారు.