ఆర్సీబీ కెప్టెన్ గా రజిత్ పాటిదార్
NEWS Feb 13,2025 11:23 am
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి 20 తర్వాత ప్రారంభమయ్యే టాటా ఐపీఎల్ 2025లో ఆడే ఆర్సీబీ జట్టుకు నూతన కెప్టెన్ గా యంగ్ క్రికెటర్ రజిత్ పాటిదార్ ను నియమించినట్లు వెల్లడించింది. అందరూ విరాట్ కోహ్లీకి ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది సీనియర్లకు. రజిత్ పాటిదార్ టీమ్ కు నాయకత్వం వహించేందుకు అర్హుడని స్పష్టం చేసింది.