Logo
Download our app
వాట్సాప్ ద్వారా ద‌ర్శనం టికెట్లు
NEWS   Feb 12,2025 08:12 am
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దుర్గా మ‌ల్లేశ్వ‌ర ఆల‌యాన్ని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా టికెట్ల‌ను పొందేందుకు వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా మ‌న మిత్ర పేరుతో దీనిని స్టార్ట్ చేసింది. ఇందు కోసం అధికారికంగా వాట్సాప్ నంబ‌ర్ 95523 00009ను కేటాయించింది. 160 ర‌కాల పౌర సేవ‌ల‌ను అందిస్తోంది. దేవాల‌య‌, ఇంధ‌న‌, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ‌లు ఉన్నాయి. దుర్గ‌మ్మ గుడికి సంబంధించి ఆర్జిత సేవ‌, విరాళం, ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source