అగస్త్య మహర్షి ఆలయ సన్నిధిలో పవన్ కళ్యాణ్
NEWS Feb 12,2025 07:56 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ లోని కొచ్చి సమీపంలో పేరు పొందిన శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సాదర స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు అకీరా కొణిదల, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి కూడా ఉన్నారు. అక్కడి నుంచి తమిళనాడుకు వెళతారు డిప్యూటీ సీఎం. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాలను దర్శించాలని నిర్ణయం తీసుకున్నారు.