Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌లో లోపాలు స‌రి చేయండి
NEWS   Feb 12,2025 03:30 am
ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌లో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని, వాటిని స‌రిదిద్ది నిమ్న కులాల‌కు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణను స్వాగ‌తిస్తున్నామ‌ని, కానీ చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. వెనుక‌బడిన కులాల‌ను ఏ గ్రూప్ లో క‌ల‌పాల‌నే దానిపై సీఎం రేవంత్ రెడ్డికి తెలియ చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source