జీఈఈ మెయిన్ మొదటి సెషన్ రిజల్ట్స్ రిలీజ్
NEWS Feb 11,2025 12:53 pm
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 22 నుంచి 29 వరకు మెయిన్ పరీక్ష చేపట్టారు. 9 లక్షల మంది విద్యార్థులు రాశారు. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఎగ్జామ్ జరగనుంది. బాలికల కేటగిరీలో ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞతో పాటు తెలంగాణకు చెందిన విద్యార్థి బని బ్రత మాజీ కి 100 పర్సంటైల్ వచ్చాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 శాతం సాధించాడు.