జబల్ పూర్ లో ట్రక్కును ఢీకొన్న ఏపీ బస్సు
NEWS Feb 11,2025 05:57 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభ మేళాకు హాజరై ఏపీకి తిరిగి వస్తున్న ప్రయాణీకుల బస్సు మొహ్లా బార్దీ సిహూరా సమీపంలోని జాతీయ రహదారి 30పై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.