Logo
Download our app
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లేవీ..?
NEWS   Feb 10,2025 11:41 am
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ఇంకెప్పుడు నిర్ణ‌యం తీసుకుంటారంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేందుకు ఇంకెంత స‌మ‌యం పడుతుందంటూ ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. 10 నెల‌లు గ‌డిచినా చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించింది. ఈ విష‌యం గురించి స్పీక‌ర్ ను అడిగి చెబుతానంటూ కోర్టుకు విన్న‌వించారు న్యాయ‌వాది ముఖుల్ రోహిత్గీ. కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై త‌దుప‌రి విచార‌ణ 18కి వాయిదా వేసింది.
⚠️ You are not allowed to copy content or view source