ఆప్ కు ప్రజలు బుద్ది చెప్పారు
NEWS Feb 09,2025 08:59 am
తమకు ఎదురే లేదని అహంకార పూరితంగా వ్యవహరించిన ఆప్ కు తగిన రీతిలో ఢిల్లీ ప్రజలు బుద్ది చెప్పారని, తగిన గుణపాఠం నేర్పారని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికలకు ప్రస్తుతం దేశ రాజధానిలో జరిగిన శాసన సభ ఎన్నికలకు భావ సారూప్యత ఉందన్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగిరిందన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. కేంద్ర సహకారంతో ఏపీ పురోగమిస్తోందన్నారు.