ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
NEWS Feb 09,2025 06:07 am
ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ప్రధాన రహదారి పై గల పాత వంతెనకు చీరతో ఉరే వేసుకుని కోడెం సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మంగపేట ముత్యాలమ్మ వీధిలో నివాసం ఉంటున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.