రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
NEWS Feb 07,2025 02:04 pm
రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగడం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సదరు బుక్ ఉన్నంత వరకు వైసీపీ నేతలపై కేసులు పెడుతూనే ఉంటారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త నగరాలు నిర్మించడం సాధ్యం కాదన్నారు. మూడు రాజధానులపై తమ వైఖరి ఏమిటో చెబుతామన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏం జ్వరం వచ్చిందో తెలియదన్నారు.