వచ్చే ఏడాది నుంచే తల్లికి వందనం పథకం
NEWS Feb 07,2025 06:38 am
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యంతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం తీసుకు వస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు అన్నం అందజేస్తున్నామని చెప్పారు. విద్యా రంగంలో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.