సాయిబాబా ఆలయంలో చోరీ
NEWS Feb 07,2025 06:38 am
ములుగు జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. ఆలయంలోనికి ప్రవేశించి హుండీలను తాళాలు పగలగొట్టి నగదును దోచుకెళ్ళారు.
సాయిబాబా ఆలయంలో ఇప్పటికే ఆరు సార్లు దొంగలు పడినట్టు ఆలయ వ్యవస్థాపకులు రజని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.