త్వరలో పీసీసీ కార్యవర్గం
NEWS Feb 07,2025 03:52 am
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో అధిష్టాన పెద్దల్ని ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందన్నారు.