ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
NEWS Feb 06,2025 10:44 am
తలసేమియా బాధితుల సహాయార్థం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సమర్పణలో జరుగుతుందని తెలిపారు నారా భువనేశ్వరి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని వెల్లడించారు. బాధితుల కోసం షో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు థమన్.