ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి పెట్టను
NEWS Feb 05,2025 11:08 am
మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టనంటూ హెచ్చరించారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈసారి ప్రజల్లోకి వస్తానని, ఎవరు ఏం చేస్తారో చూస్తానన్నారు. కూటమి సర్కార్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కార్యకర్తల కోసం తాను ఎలా పని చేస్తానో ప్రత్యక్షంగా చూపిస్తానని అన్నారు. ప్రజల కోసం పాటు పడ్డానని..మిమ్మల్ని పట్టించు కోలేక పోయానని వాపోయారు.