బదిలీల పైరవీలపై సీఎం సీరియస్
NEWS Feb 05,2025 11:03 am
సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సచివాలయంలో బదిలీ చేసిన 177 మంది సెక్షన్ ఆఫీసర్ల జాయినింగ్ కు సంబంధించి ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిక్వెస్ట్ లకు ఛాన్స్ ఇవ్వవద్దంటూ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. తమకు కేటాయించిన ప్రాంతాలలో చేరని ఉద్యోగుల వివరాలు సేకరించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.