Logo
Download our app
భైంసా పట్టణంలో చోరీలు
NEWS   Feb 03,2025 04:13 am
భైంసా పట్టణంలో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. ఆలయాలు, ఇళ్లు, దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. రాత్రి దాటిన తర్వాత భైంసా-నిర్మల్‌ రహదారిలో ఎస్‌బీఐ బ్యాంక్‌ సమీపంలో ఆన్‌లైన్‌ డెలివరీ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఉదయం క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. స్థానిక పులేనగర్‌లో ఓ ఇంటి ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యా యి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source