Logo
Download our app
ప్రారంభం అయిన పసుపు తవ్వకాలు
NEWS   Feb 03,2025 03:41 am
నిజామాబాద్ జిల్లాలో పసుపు కోతలు మొదలయ్యాయి. మొక్కలను తొలగించి పసుపు కొమ్ములను తవ్వి తీస్తున్నారు. పసుపును స్టీమ్ చేసి ఎండ బెట్టడం ప్రారంభమైంది. ఎండిన కొమ్ములను డ్రమ్ములో వేసి పాలిష్​ చేస్తున్నారు. ఆర్మూర్​ డివిజన్ తోపాటు మెట్​పల్లి, నిర్మల్​ ఏరియాల్లో పసుపు సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం మోర్తాడ్​, కమ్మర్​పల్లి మండలాల్లో కోతలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల నుంచి ఇప్పటికే పసుపు మార్కెట్​కు వస్తోంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ 10 వేల వరకు పలుకుతోంది.
⚠️ You are not allowed to copy content or view source