Logo
Download our app
పసుపు రైతుల పరిస్థితి దయనీయం
NEWS   Feb 03,2025 03:42 am
పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్‌కు వస్తే గిట్టుబాటు ధర కరువైంది. పసుపు రైతాంగం ఆందోళన చెందుతున్నది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు వారం రోజుల నుంచి పసుపు రాక ప్రారంభం కాగా, ధర అంతంత మాత్రమే పలుకుతున్నది. ఉత్పత్తి తగ్గి, ఖర్చులు పెరిగి ఎనలేని భారం మోస్తున్న అన్నదాతలకు ప్రస్తుతం పలుకుతున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని అంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source