Logo
Download our app
భార‌త్ దే అండ‌ర్ -19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్
NEWS   Feb 02,2025 10:06 am
వుమెన్స్ అండ‌ర్ 19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ద‌క్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని సాధించింది. స‌ఫారీ జ‌ట్టును 82 ప‌రుగుల‌కే ప‌రిమితం చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన టీమిండియా 11.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 1 వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. తెలంగాణ బిడ్డ గొంగ‌డి త్రిష 33 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల‌తో 44 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. బౌలింగ్ లోనూ ప్ర‌తిభ చాటింది. 3 వికెట్లు తీసింది.
⚠️ You are not allowed to copy content or view source