చంద్రబాబు వైఫల్యం ఏపీకి అన్యాయం
NEWS Feb 02,2025 03:29 am
కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన బడ్జెట్ 2025పై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీకి ఇంత అన్యాయం జరగడానికి ప్రధాన కారకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడేనని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎంపీల మద్దతుతో కేంద్రంలో కొలువు తీరిన మోడీ ఎన్డీయే సర్కార్ పూర్తి వివక్ష చూపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అత్యుత్సాహం, బాధ్యతా రాహిత్యం ఏపీ పాలిట శాపంగా మారిందన్నారు.