చెత్తను తొలగించండి
NEWS Feb 01,2025 04:41 pm
కరీంనగర్ నగరంలోని కశ్మీర్ గడ్డ కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలతో వాహనదారులు, పాదచారులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ సమీపంలో తక్షణమే చెత్తను తొలగించాలని లేక పోతే దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతాం అని వాహనదారులు, పాదచారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.