ఆరు నూరైనా సరే పథకాలను ఆపం
NEWS Jan 31,2025 03:40 am
ఆరు నూరైనా సరే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తి లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్ని అప్పులు చేసైనా సరే లబ్దిదారులకు నిధులు పంపిణీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆన్ గోయింగ్ పథకాలను ఎందుకు నిలుపుదల చేస్తామంటూ ప్రశ్నించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.