సమగ్ర ఇంటింటి సర్వే బిగ్ సక్సెస్
NEWS Jan 29,2025 09:16 am
రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన పై సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు . సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని, పూర్తి నివేదికను ఫిబ్రవరి 2 వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి అందజేస్తామన్నారు.