ఘనంగా అధ్యయనోత్సవాలు ప్రారంభం
NEWS Jan 29,2025 07:57 am
తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలలో భాగంగా మాఘ మాసంలో ఆలయంలో దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీఈవో శాంతి పాల్గొన్నారు.