దంపతులపై దాడి.. హత్యాయత్నం కేసు
NEWS Jan 29,2025 02:03 pm
దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పిటిఎం మండలం డి. నారాయణ రెడ్డి పల్లికి చెందిన వెంకట రమణారెడ్డి ఇంటిలోకి ప్రతాపరెడ్డి దౌర్జన్యంగా వెళ్లి వెంకటరమణారెడ్డి, అతని భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ప్రతాపరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.