ఎన్సిసి విద్యార్థులను అభినందించిన మంత్రి
NEWS Jan 29,2025 06:31 am
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. బుధవారం చిన్న మండెం మండలం బోరెడ్డి గారి పల్లిలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాయచోటి నుండి విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభ కనబరచడం హర్షణీయమని అన్నారు.