Logo
Download our app
ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ తీసేందుకు కుట్ర
NEWS   Jan 28,2025 01:10 pm
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలని కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనుషుల్ని పెట్టి విష ప్రచారాలు చేసినా దావోస్ పర్యటనలో లక్షా 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామ‌న్నారు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బు తీసుకెళ్లి వాళ్లు విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. ఈ-ఫార్ములా కేసులో ఇక్కడి సొమ్ము విదేశాలకు పంపి పెట్టుబడి పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. ల‌క్షా 80 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ సాధించామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source