సైబర్ నేరాలపై అవగాహన
NEWS Jan 28,2025 11:24 am
ఒంటిమిట్ట సిఐ బాబు ఆధ్వర్యంలో సిద్దవటం వెలుగు పల్లిలో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సైబర్ నేరాల గురించి తెలపాలన్నారు. చదువుకోని వారు, చదువుకున్నవారు సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోతున్నారని అన్నారు. స్మార్ట్ ఫోన్లు మంచి కొరకు ఉపయోగించుకుంటే జీవితం సాఫీగా సాగి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు.