రాజంపేట మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం
NEWS Jan 28,2025 10:50 am
రాజంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకు పోయింది. కాలువల్లో నిలిచిన మురుగు నీరు దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజంపేట వీధులలో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందిని ప్రజలు వాపోతున్నారు. బలిజపల్లి రోడ్డు, గంగిరెడ్డి పాలెం, అగ్రహారం లో చెత్త పేరుకు పోయిందని తెలిపారు.