సామూహిక జీవన సంస్కరణ హోమం
NEWS Jan 28,2025 04:50 am
బుచ్చియ పేట మండలం చినమల్లం గ్రామ పరిధిలో మెర్కాబ జ్ఞాన మందిరంలో 108 రోజుల అఖండ ధ్యాన రూపకర్త ఏఈవో అనందకుమార్ అధ్వర్యంలో సామూహిక జీవన సంస్కరణ హోమం ఘనంగా జరిగింది. విశాఖ అనకాపల్లి జిల్లాకు చెందిన 108 మంది నూతన దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. సింహాచల వేద పండితులు చే పెళ్లి పెళ్లి నాటి మంత్రాల అర్థాలు వివరించారు. ముఖ్య అతిథులుగా వుత్త రాంద్ర పీఠాదిపతులు శ్రీ శ్రావణ చైతన్య నంద చిన్న స్వామి, మాతాజీ హాజరయ్యారు.