Logo
Download our app
సంక్షేమ పథకాల అమలును ప్రారంభించిన కలెక్టర్
NEWS   Jan 27,2025 09:41 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా పథకాల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source