తిరుమలలో గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2025 05:59 am
తిరుమలలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫీడ్బ్యాక్ సిస్టంతో భక్తులకు మరింత సౌకర్య వంతమైన దర్శనం కల్పించడమే తమ ధ్యేయమన్నారు. టీటీడీ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 96 శాతం భక్తుల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.