వైజ్ఞానిక ప్రదర్శనలో మెట్పల్లి విద్యార్థులు
NEWS Jan 25,2025 05:24 pm
ఈ నెల 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన 6 రాష్ట్రాల దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో మెట్పల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. వీరు రూపొందించిన ప్రదర్శనకు ప్రత్యేక బహుమతి లభించింది. విద్యార్థులు వర్షిత, వాగ్దేవి, గైడ్ టీచర్ ఇంద్రాలసతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రూపొందించిన మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్కు ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. వారిని పలువురు అభినందించారు.