అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య
NEWS Jan 24,2025 02:39 pm
కామారెడ్డి ఎల్లారెడ్డి: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాశీరాం అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు తెలిపారు.