Logo
Download our app
డాక్టర్ మనిషాకు సన్మానం
NEWS   Jan 23,2025 10:47 am
కిసాన్ సేవా రత్న జాతీయ అవార్డు స్వీకరించిన సందర్బంగా ప్రాథమిక పశువైద్య కేంద్రంలో డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ ను చౌలమద్ది గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సాధారణ పశువైద్య సేవలను సక్రమంగా అందిస్తూనే, ఇతర సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండే డా. మనీషా పటేల్ సేవల‌ను రైతులు, గ్రామస్తులు కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక మైన పురస్కారాన్ని పొందటం తమ గ్రామానికి, మండలానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల అంజయ్య, బండారి గంగాధర్, నాగెల్లి గంగారాం త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source