హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్
NEWS Jan 23,2025 08:27 am
దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కార్యదర్శి జయేశ్ రంజన్ ఇన్ఫోసిస్ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. క్యాంపస్ ఏర్పాటు వల్ల 17,000 మందికి పైగా ప్రతిభ కలిగిన ఐటీ నిపుణులకు అవకాశాలు లభిస్తాయని ప్రకటించింది.