తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Jan 23,2025 05:23 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 62 వేల 223 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.10 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.